భారత్లోని నీళ్లపై భారత దేశానికే హక్కు ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ప్రవహించే నీటిని దేశ అవసరాలకే వాడుకుంటామని ప్రధాని తేల్చి చెప్పారు. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. సింధూ నది నీటిని పాక్లోకి వెళ్లకుండా అడ్డుకున్న వ్యవహారంపై తొలిసారి మోదీ మీడియాతో మాట్లాడారు. గతంలో భారత్లో ప్రవహించిన నీరు.. ఇతర దేశాలకు వెళ్లేవని.. కానీ ఇక నుంచి మన దేశంలో ప్రవహించే నీరు.. మనకే ఉంటాయని స్పష్టం చేశారు.