కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమపై ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని, ఆర్మీని అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.