జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ప్రజలు బాధతో రగిలిపోతున్నారు. వెనుక ఉండి ఉగ్రవాదులతో ఈ దాడులు పాకిస్థాన్ చేయిందనే ఆవేశంతో ఉన్నారు. అయితే ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో సంబురాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. హైకమిషన్లోకి అక్కడ పనిచేసే వ్యక్తి కేక్ తీసుకెళ్తూ కనిపించాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు.