పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడితో భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఉగ్రవాదులకు స్థావరాలుగా మారిన ప్రదేశాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మన రక్షణ దళాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న తీవ్రవాది మసూద్ అజార్ ఉగ్రవాద స్థావరం శిథిలావస్థకు చేరుకుంది. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ లో వీరి కుటుంబం నుంచి 10 మంది మృతి చెందినట్లు తెలిసింది.