ముంబయి 26/11 ఉగ్రదాడి కుట్రదారుడు, పాకిస్థానీ కెనడియన్ తహవూర్ హుస్సేన్ ను ఎట్టకేలకు భారత్ కు తీసుకొని వచ్చారు. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా.. 18 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ -NIA కస్టడీకి అనుమతించింది. అమెరికాలో చట్టపరంగా అన్ని అవకాశాలూ మూసుకుపోవడంతో రాణాను అగ్రరాజ్యం భారత్కు అప్పగించిన విషయం తెలిసిందే.