జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. ఈ చర్యల్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుకుపడింది. లష్కరే తొయిబా సహా ప్రధాన ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడి చేసింది. మే 7వ తేదీ అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ ఆపరేషన్ జరిగింది. ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో ఫ్రెంచ్ కి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించారు. అయితే ఇవే ఎందుకు ఉపయోగించారో చూద్దాం.