పార్లమెంట్పై దాడి నుంచి పహల్గాం వరకు.. 350 మంది పౌరులను పాక్ ఉగ్రవాదులు చంపారని భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతయ్యారు.