పాకిస్థాన్ కుట్రలను మన సైన్యం సమర్ధవంతంగా తిప్పి కొడుతోంది. ఉగ్ర మూకలను పెంచి పోషించటంతోపాటు వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ పై దుస్సాహసానికి ఒడిగట్టింది.రెచ్చగొట్టే ధోరణిని పదే పదే మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లపైకి వాటిని వదిలింది. అయితే పాక్ కుటిల ప్రయత్నాలను భారత్ ఆదిలోనే తుంచింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది.