పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్ర దాడికి మన సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తోంది. ఇక దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బహావల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్పై క్షిపణి దాడులు జరిగాయి.