దేశంలో మరోసారి కరోనా తీవ్ర కనిపిస్తోంది.దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా 6వేల 50 కొవిడ్ కేసులు బయటపడ్డంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్లకు పైగా ఉంది. ఈ వారం రోజుల డేటా చూస్తే నిన్న గణనీయంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 14 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 4,41,85,858గా ఉంది.