జమ్ముకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో సరిహద్దు వెంట మన దేశ బలగాలు అను నిత్యం గస్తీ కాస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకున్నాయి. ఏ క్షణమైనా భారత్ దాడి చేయచ్చని భావిస్తోన్న పాక్.. తన బలగాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ భారత పోస్ట్లపై కాల్పులకు తెగబడ్డాయి. పాక్ చర్యలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది. ఇక ఉగ్రదాడి ప్రతీకారానికి భారత ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఇవాళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. భద్రతా పరిస్థితిని ద్వివేది సమీక్షిస్తారు.