పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట తెల్లవారుజామున పాక్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు గుర్తించి కచ్చిత లక్ష్యంతో వైమానిక దాడులు నిర్వహించినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. పీవోకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్పూర్లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాక్ ఆర్మీ ధ్రువీకరించింది.