జమ్మూ కశ్మీర్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. రాంబన్లో ఒక్కసారి క్లౌడ్ బరెస్ట్ కావటంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 44 పై పెద్ద బండ రాళ్లు పడటం మూలంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాంబన్లోని ధర్మ్ కుండ్ గ్రామంతో సహా అనేక ప్రాంతాల్లో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో 10 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు అధికారులు. అయితే ఇప్పటికే ప్రజలు వర్షాల నుంచి తేరుకోలేదు.