సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకటే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితమే పెళ్లి అయినట్లు బంధువులు చెప్పారు. హైదరాబాద్ లో పని చేస్తూ అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వారు వచ్చారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా 25 లక్షలు ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పింది. అయితే కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సైతం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే భారీ వర్షానికి, ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవటంతో ఆ జంట చనిపోయింది. ఈ ఘటనలో మెుత్తం 8 మంది చనిపోయారు.