ఉగ్ర వాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. భారత్ పై దాడులకు దిగింది. డ్రోన్లు, యుద్ధ విమానాలతో దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసింది. ఈ చర్యలను మన సైన్యం తిప్పి కొట్టింది. తోక ముడిచేలా త్రివిధ దళాలు ఎదురు దాడులు చేశాయి. ఈ క్రమంలోనే మన సైన్యం కోసం అస్సాంలోని గువహతిలో ఉన్న కామాఖ్య ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సైన్యానికి విజయం చేకూరాలని ప్రార్ధనలు చేశారు.