పర్యాటకులను కాపాడటంలో తాను విఫలం అయ్యానని పహల్గాం దాడిని గుర్తు చేసుకుంటూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించిన ఆ రాష్ట్ర యంత్రాంగం.. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన దాడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని అన్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించిన ప్రజా ప్రతినిధులు.. దేశంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 21 ఏళ్ల తర్వాత బైసరన్లో ఈ దాడి జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు క్షమాపణలు అడగడానికి తనకు మాటలు రావడం లేదని సీఎం అన్నారు.