పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అక్రమంగా దేశంలో ప్రవేశించి ఇక్కడే తిష్టవేసిన వారి భరతం పడుతున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. 50 జేసీబీలు, 2 వేల మంది పోలీసులు షాకింగ్ ఆపరేషన్ చేశారు. బంగ్లాదేశీయుల అక్రమ నివాసాలను బుల్డోజ్ కూల్చి వేశారు.