భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జల వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, తాజాగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను మూసి వేసింది. దీంతో పాక్ లోని అనేక ప్రాంతాలు నీటి ఎద్దడి ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో జీలం నదిపై ఉన్న కిషన్గంగా రిజర్వాయర్ ద్వారా కూడా నీటి సరఫరా నిలిపివేయాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం ఉంది.