రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిస్తున్నారు. చంద్రబాబును జైలుకు తరలించినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇవాళ చర్చికి వెళ్లారు. రాజమండ్రి జాంపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు బయటకు రావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు. అక్రమంగా 19 రోజులపాటు చంద్రబాబును జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.