హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులతో వెలిగిపోయింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.2.23 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన లైటింగ్ సిస్టమ్ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జూన్ 9న ప్రారంభించారు. ఈ సరికొత్త లుక్ తో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం మరింత శోభాయమానంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వీడియోను ఇక్కడ వీక్షించండి….