కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిరుద్యోగులు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తం అయ్యాయి. ఇవాళ చలో సచివాలయానికి పిలుపునివ్వటంతో అక్కడ పోలీసుల పహరా పెంచారు. అయినప్పటికీ నిరుద్యోగులు సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తోపులాట కారణంగా పలువురి చొక్కాలు చిరిగాయి.