బిగ్ బాస్ సీజన్ 7లో సోమవారం నామినేషన్లు గతంలో అంత కాకపోయినా వాడివేడిగానే సాగాయి. నామినేషన్ల బాధ్యతను లేడీ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టడంతో సీరియర్ బ్యాచ్ సేఫ్ జోన్ లోనే ముందుకు సాగింది. ప్రియాంక జైన్, రతిక రోజ్, శోభా శెట్టి, అశ్వినీ శ్రీలు రాజమాతలుగా సింహాసనాలపై కూర్చొని వాదనలు విన్నారు. చివరికి భోలే షావలి, గౌతమ్, శివాజీ, యావర్, రతికలు నామినేషన్లలో ఉన్నారు. దీంతో రతిక మరోసారి డేంజర్ జోన్లోకి వచ్చింది. అశ్వినీ బతికిపోయింది. ఇక శివాజీ కోసం డాక్టర్ రూపంలో కొడుకు హౌస్ లోకి వచ్చాడు. కొడుకును హౌస్ లోని వ్యక్తులకు శివాజీ పరిచయం చేశాడు. అయితే ఈ వారం సాగిన నామినేషన్లు చాలా పేలవంగా ఉన్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు.