ఈ మధ్యకాలంలో నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు. సినిమా ప్రమోషన్ల నుంచి వ్యక్తిగత అభిరుచుల వరకు అన్నింటినీ పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ శృతిహాసన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఫ్యాన్స్ పలు ప్రశ్నలు అడగ్గా.. ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది. శృతిహాసన్ ఏడుస్తుందా..? అని ఒక నెటిజెన్ అడ్డగా.. నేను చాలా సున్నితమైన మనిషిని అని సమాధానం ఇచ్చింది. చిన్నతనంలో మీరు ఎలాంటి జాబ్ చేయాలని అనుకున్నారని ప్రశ్న వేయగా శృతి బదులిస్తూ.. బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా చేయాలని అనుకున్నానని సమాధానం ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు.