ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందాయి. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, ఏడు పద్మవిభూషణ్ పురస్కారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కింది.