తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీనికి 14 రోజులు రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైల్కు పోలీసులు తరించారు. అంతక ముందు అఘోరీకి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అఘోరీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన అఘోరీ జైలుకు వెళ్లినా తన భార్య తనతోనే ఉంటుందన్నారు. ఇక ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని మహిళ పోలీసులను ఆశ్రయించింది.