ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్లు బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. అటు మూడో రోజు సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ను అడ్డుకోవడం సరికాదన్నారు.