వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్ముకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందారు మురళీ. ఈ క్రమంలోనే వారి ఇంటికి వెళ్లిన జగన్ తల్లిదండ్రులను పరామర్శించారు. మురళీనాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.