సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో విషాదం చోటు చేసుకుంది. 300 రూపాయల టోకెన్ తీసుకొన్న క్యూలైన్లలో గోడ కూలి 8 మంది భక్తులు చనిపోయారు. ఇప్పటికే 8 మంది భక్తుల మృత దేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మరో 10 మంది వరకూ గాయపడ్డారు. వీరిని కేజీహెచ్కు తరలించారు. ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు ముగిశాయని అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి తర్వాత వచ్చిన భారీ వర్షం, ఈదురుగాలులే ఘటనకు కారణం అని తెలుస్తోంది.