భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ దాడులను సమర్ధవంతంగా తిప్పి కొడుతున్న మన సైన్యం.. ఎదురు దాడి చేస్తోంది. పాక్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా హై అలర్ట్ లో యంత్రాంగం ఉంది. ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు పోలీసులు. నెల్లూరులో రైల్వే స్టేషన్ సహా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏ చిన్న అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా అన్నీ కోణాలు ఆరా తీస్తున్నారు.