ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం గురువారం వరకు కొనసాగుతున్నందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్న 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.