Vizag RushiKonda | రుషికొండ వద్ద కేఏపాల్.. మీడియాని అడ్డుకున్న పోలీసులు-prajashanti party president kapaul halchal at rushi konda in vizag ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vizag Rushikonda | రుషికొండ వద్ద కేఏపాల్.. మీడియాని అడ్డుకున్న పోలీసులు

Vizag RushiKonda | రుషికొండ వద్ద కేఏపాల్.. మీడియాని అడ్డుకున్న పోలీసులు

Published Mar 01, 2024 01:06 PM IST Muvva Krishnama Naidu
Published Mar 01, 2024 01:06 PM IST

  • విశాఖ రుషికొండలో కట్టిన నిర్మాణాల ప్రారంభోత్సవం అంత నిర్బంధంగా ఎందుకు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రశ్నించారు. గురువారం విశాఖలో పర్యటించిన కేఏపాల్, రుషికొండ మార్గంలో వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ఆపేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కేఏపాల్.. పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. రుషికొండలో ఏమైన నరబలి జరుగుతుందా అని ప్రశ్నించారు. మీడియాని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు ఏ సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కి కేఏపాల్ వార్నింగ్ ఇచ్చారు.

More