పిఠాపురంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.తనని గెలిపించిన ప్రజలకు అన్నీ ప్రభుత్వ సౌకర్యాలు అందుబాటులో ఉండాలని తపిస్తున్నారు. ఇందులో భాగంగానే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపవన చేశారు. గతంలో ఇది 30 పడకలుగా ఉండేది. ఇక ఇందులో అధునాతన పరికరాల అందుబాటులోకి తీసుకు రావాలని పవన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.