లోక్సభ ఎన్నికల వేళ పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డబ్బులు, మద్యం, బంగారం సహా ఇతర ఉచితాలు సరఫరాకు అడ్డుకట్ట వేయాలని ఉద్దేశంతో పటిష్టంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువులను సీజ్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేశారు.