జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ మృతి చెందారు. ఇవాళ కావలి పట్టణానికి ఆయన భౌతిక కాయం చేరుకుంది. ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక మధుసూదన్ రావు 12 సంవత్సరాల క్రితం బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతదేహానికి నేడు కావలిలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ సంస్కారాల్లో మంత్రులు పాల్గొననున్నారు.