చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు కాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కుమ్మరి కుంటకి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కుంటున్నాడు. పలుమార్లు పాము కాటుకు గురైనా మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా.. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడట. అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.