ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు ఉండటం కుట్రకోణం బలపరుస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని వారి దగ్గర నుండి అందిన సమాచారం ప్రకారం ఈ విషయం తెలుస్తుందన్నారు. ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు నిమ్మల.