ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని చెప్పారు. విశాఖలో ‘మహిళా రక్షణకు కలసికట్టుగా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం మాట్లాడారు. స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్ట్గా పాఠాల్లో చేర్చుతామని వివరించారు. నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని కోరారు. యువత భవిష్యత్తును గంజాయి నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.