ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సింహాచలంలో ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇవాళ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లిన ఆయన.. బాధితులను పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారన్న అమర్నాథ్.. గోడ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారని అన్నారు. కొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలన్నారు. ఇక చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.