తిరుమల గోశాల అంశంపై మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్లు వేశారు. సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు పవన్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం తిరుమల గోశాలలో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుందన్నారు. గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కథ అల్లి రాజకీయం చేశారని ఆరోపించారు.