విజయ సాయి రెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన అంబటి.. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడే వాళ్లకు ఏం సమాధానం చెప్తామన్న అంబటి.. ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశామన్నారు. సమస్యను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడటంలో చాలా సిన్సియర్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు పని చేశారని అంబటి కొనియాడారు.