ఏపీ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మానవత్వం మరిచి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరికైనా గుండెపోటు రావచ్చన్నారు. రెడ్ బుక్ చూసి ఒకరికి గుండెపోటు, ఇంక్కొక్కరు బాత్రూంలో పడిపోయి చెయ్యి విరిగి పడిపోయిన మాటలు సరి కాదన్నారు. రాష్ట్రంలో గుండెపోటు వచ్చినోళ్లు, చెయ్యి విరగొట్టుకున్నోళ్లు నీ రెడ్ బుక్ చూసినట్లా నారా లోకేష్ అని ప్రశ్నించారు.