సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారని అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.