అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనతో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆరు, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాడీలను బంధువులకు అప్పగించారు. ఇక ప్రమాదంలో గాయ పడిన వారు విశాఖ KGHలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.