ఏలూరు జిల్లా కొత్త బస్టాండ్ సమీపంలో పోలీసులు దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 3 లక్షలు ఇస్తే 40 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. దీనిపై బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ప్రత్యేక నిఘా పెట్టిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ తెలిపారు.