జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి ఏపీ శాసనసభలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తాను.. మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపైనే అని పవన్ చెప్పుకొచ్చారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఆయనను తప్పించినట్లు తెలిపారు. రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీలో జరిగిందని తెలిపారు.