టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో కలిసి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ ప్రముఖుల వేడుకకు హాజరు అయ్యారు.