విజయవాడలో నిర్వహించిన ‘మైండ్సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినీ నటులు సామాజిక సేవ గురించి ఆలోచించడం అరుదని, అలా చేసిన తొలి వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. ‘మైండ్సెట్ షిఫ్ట్’ పుస్తకం ఆవిష్కరించిన అనంతరం తొలి ప్రతిని చిరంజీవికి అందించారు చంద్రబాబు.