సింహాచలం అప్పన్న చందనోత్సవంలో విషాద ఘటన జరిగింది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించారు. భారీ వర్షం, ఈదురు గాలులకి గోడ కూలిందని బీజేపీ నేత మాధవ్ అన్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన.. క్షతగాత్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది ఎంతో బాధ కలిగించే విషయం అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని, మరోసారి ఈ తరహా ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.