భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం రావచ్చని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంచనా వేశారు. ఇవాళ, రేపటిలోగా ఈ యుద్ధం ఉంటుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మన దేశ సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరారు. ఇవాళ నర్సీపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి.. ఆయన సైన్యానికి సంఘీభావం తెలిపారు. భారత్ శాంతి దేశం అయినా.. ఒక సారైనా పాక్ కు బుద్ధి చెప్పాలని అయ్యన్న పాత్రుడు అన్నారు.