ముస్లింల మీద వివక్ష చూపిస్తే కోట్ల మంది ఆ వర్గం వారు ఇక్కడ ఉండేవారా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారత్లో కూడా అంతే ఉందని అన్నారు. కొందరు నాయకులు పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని అలాంటి వారు దేశం విడిచి పోవాలన్నారు. హిందువులకు ఉన్న దేశం ఇది ఒక్కటేనని భావోద్వేగంతో పవన్ అన్నారు.